Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్
- ఆర్టీసీ జేఏసీ నేతల భేటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్లో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ సంపత్కుమారస్వామితో, ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, సుధ భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు కలిసి పనిచేద్దామని సంపత్కుమారస్వామి అన్నారు. ఈనెల 19న రాష్ట్రబంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం పట్టింపులకు పోకుండా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణ కోసం జరిగే ఈ సమ్మెకు అన్ని వర్గాల ప్రజలూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి సమ్మెలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం బాలస్వామి, మహిళా విభాగం అధ్యక్షులు జి నిర్మల, నాయకులు సుదర్శన్గౌడ్, భరత్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.