Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజీపీఏ, జేబీవైఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ సమ్మె పేరుతో గురుకులాలకు ఎసరొచ్చిందని తెలంగాణ గురుకుల తల్లిదండ్రుల సంఘం (టీజీపీఏ), జైభీం యూత్ ఇండియా (జేబీవైఐ) ఆందోళన వ్యక్తం చేశాయి. టీజీపీఏ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఎం యాదయ్య, జేబీవైఐ వ్యవస్థాపకులు ముకురాల శ్రీహరి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురుకులాల కార్యదరద్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను మార్చొద్దని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఎండీగా నియామించాలనుకోవడం పేద విద్యార్థులపై కేసీఆర్ ప్రభుత్వ కుట్ర అని తెలిపారు. ఈ ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని సూచించారు.