Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఫాంహౌజ్లో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో నూ గజ్వేల్ నియోజకవర్గంలోనే ఎస్ఐలు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. సిద్ధిపేట జిల్లాలోనే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటు న్నాయని పేర్కొన్నారు. ఇవి పలు అనుమానాలకు తావిస్తున్నాయని తెలిపారు. ఈ ఆత్మహత్యల వెనుక గల అసలు కారణాలు ఏమిటో ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించి బయటపెట్టాలని డిమాండ్ చేశారు.