Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదనీ, విచ్చలవిడిగా మద్యం, డబ్బు సరఫరా చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి బుధవారం ఫిర్యాదు చేసింది. ఉపఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపించాలని కోరింది. బుధవారం ఈ మేరకు మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి నేతృత్వంలోని టీపీసీసీ ఎలక్షన్ కో-ఆర్డీనేషన్ కమిటీ సీఈవో రజత్కుమార్ను కలిసింది. హుజూర్నగర్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.