Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే రాష్ట్ర ప్రభుత్వ పతనం తప్పదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుతంగా సమ్మె చేస్తుండగా బాధ్యతయుతమైన పదవిలో ఉన్న సీఎం కేసీఆర్, మంత్రులు కార్మికులను రెచ్చగొట్టారన్నారు. కార్మికులు మనస్థా పం చెంది ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు. పట్టింపులకు, బేషజాలకు పోకుండా వెంటనే చర్చలకు పిలిచి డిమాండ్లను పరిష్కరిం చాలన్నారు. ఈ నెల 19న ఆర్టీసీ జేఏసీ నిర్వహించనున్న రాష్ట్ర బంద్కు మద్దతుగా నేడు వామపక్షాల ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల ఎదుట, డిపోలు మండల కేంద్రాల్లో సామూహిక దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు.