Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సచివాలయం హెచ్బ్లాక్పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
- 21కి విచారణ వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర సచివాలయంలో ఏడేండ్ల కింద నిర్మించిన హెచ్బ్లాక్ను ఎందుకు కూల్చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభుత్వం వాదించింది. అందుకే నూతన సచివాలయం నిర్మిస్తు న్నామని హైకోర్టుకు తెలిపింది. సచివాలయ భవనాల టెక్నికల్ రిపోర్ట్ను ధర్మాసనానికి సమర్పించింది. సుమారు 10 లక్షల ఎసేఫ్టీతో ఇంటిగ్రేటెడ్ సెక్రెటేరియట్ను నిర్మిస్తామని హైకోర్టుకు వివరించింది. ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం..
ఏడేండ్ల కింద నిర్మించిన హెచ్ బ్లాక్ను ఎందుకు కూల్చి వేస్తున్నారని ప్రశ్నించింది. విధానపర నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదని ప్రభుత్వం వాదించింది. సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలన్న ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎంపీ రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డిలు వేసిన పిల్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డి డివిజన్ బెంచ్ విచారించింది. సచివాలయంలోని పలు భవనాలు శిధిలా వస్థకు చేరాయని అందుకే వాటిస్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రామ చందర్రావు చెప్పారు. ఏడేండ్ల కింద నిర్మించిన హెచ్బ్లాక్ను బ్లాక్ను ఎందుకు కూల్చివేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ సచివాలయం నిర్మించాలని సర్కార్ నిర్ణయించిందని ఆయన చెప్పారు ప్రభుత్వ విధానపర నిర్ణయా ల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. గ్రీనరీతో కొత్త సచివాలయాన్ని కడతామన్నారు. ఇప్పుడున్నది అగ్నిప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉందని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము ఎలా జోక్యం చేసుకో వాలో తెలపాలని హైకోర్టు పిటిషనర్ను కోరింది. ప్రభుత్వ నిర్ణయం చట్టవ్యతిరేకంగా ఉన్నాయా?అగ్నిప్రమాదం జరిగితే బయట పడలేం. సీ బ్లాక్లో అయితే ఒక్కటే దారి ఉంటుందనీ, పలు బ్లాక్ల చుట్టూ ఫైరింజన్ తిరిగే జాగా లేదన్నారు. సెక్రెటేరియట్లో పాతబడిన బిల్డింగ్స్ కూల్చేస్తామంటే అర్ధం ఉంటుందని, కొత్త వాటిని ఎందుకు కూల్చడమని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని, దీనిలోపల జోక్యం చేసుకునేందుకు వీల్లేదని రామచందర్రావు చెప్పారు. ఇదే విషయాన్ని పిటిషనర్ తరఫు లాయర్ను హైకోర్టు ప్రశ్నించింది. రేవంత్రెడ్ది లాయర్ వాదిస్తూ వాస్తు, గ్రహదోషాలు వంటి మూఢ నమ్మకాల పేరుతో కూల్చాలని భావించడం అన్యాయమన్నారు. రేపు మరో సర్కార్వచ్చి ఇప్పుడు కట్టబోయేవాటిని కూల్చేస్తామంటే ఏం చేయాలో కూడా ఆలోచన చేయాలనీ, అప్పుడు కూడా ప్రభుత్వం విధాన నిర్ణయమే అని చెబితే ప్రజాధనం ఏం కావాలని అన్నారు. కోర్టు సమయం ముగియడంతో విచారణ 21కి వాయిదా పడింది.