Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ హోంగార్డులను తొలగిస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో వారు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నిర్ణయంపై అధికారులు, మంత్రులు భిన్న వ్యాఖ్యల చేస్తున్న క్రమంలో హోరగార్డులు మరింత అయోమయానికి లోనవుతున్నారు. ఈ సందర్భంలో సంబంధిత శాఖ మంత్రిచేతన్ చౌహాన్ స్పందిస్తూ.. తొలగింపుపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదనీ, ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించబోమని హామీనిచ్చారు. అయితే బడ్జెట్ పరిమితుల కారణంగా పనిదినాలను 30 రోజుల నుంచి 20 లేదా 22రోజులకు తగ్గిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంపై తాను మరోసారి ముఖ్యమంత్రిని కలుస్తానని ఆయన తెలిపారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీపావళి పండుగ ముందు హోంగార్డుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి. బీజేపీ సర్కార్ ఉద్యోగాలు సృష్టించడానికి బదులు నిరుద్యోగాన్ని పెంచుతున్నదని విమర్శించాయి. హోంగార్డులకు సోషల్ మీడియాలో రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. ఈ చర్య అప్రజాస్వామికమని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
హోంగార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. అసలు సమస్య నుంచి దృష్టిని మళ్లించడానికి హోంశాఖ మంత్రి ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో ఇదే తరహాలో బడ్జెట్లేమీతో 16,519 మంది హోంగార్డులను విధుల నుంచి తొలగించారని తెలిపారు. ప్రస్తుతం 25వేల మరది హోంగార్డుల కుటుంబాల బతుకులు ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శారతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయనీ, వచ్చే నెలలో అయోధ్య తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలనీ, ఆ తీర్పు ప్రభావం రాష్ట్రంపై అధికంగా ఉంటుందని తెలిపారు.