Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనం ప్రాణాల కన్నా.. ఖజానా వైపే సర్కార్ దృష్టి
- మద్యం షాపులకు ఫుల్లు గిరాకీ
- రంగంలోకి వేలల్లో నిరుద్యోగులు.. ఎన్నారైలు
- 2216 షాపులు.. 48వేల దరఖాస్తులు.. వెయ్యి కోట్లు జమ
నవతెంలగాణ బ్యూరో-హైదరాబాద్
కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించే కంటే..రూ. 2లక్షల పెట్టుబడి పెట్టి కోట్లు గడించే అవకాశం కేవలం ఒక్క మద్యం వ్యాపా రంలోనే ఉంది. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా 2,216 మద్యం షాపులకు దాదాపుగా 48వేల మంది దరఖా స్తు చేశారు. ఆశావాహుల పరిస్థితి ఎలా ఉందో కానీ, రాష్ట్ర ఖజానా మాత్రం ఆశాజనకంగా మారింది. కేవలం వారం రోజుల వ్యవధిలో ఎలాంటి పెట్టుబడి లేకుండానే రూ.1000కోట్ల ఆదాయాన్ని సమకూర్చు కుంది.
ఈసొమ్ము తిరిగి ప్రజలకు చెల్లించాల్సిన అవ సరం కూడా లేదు. వాస్తవానికి ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం కేవలం ఖజానా నింపుకోవటంపై లెక్కలు వేస్తున్నదని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఉచితంగా ఖజానాకు చేరిన ఈ సొమ్మును ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తే కార్మికులు సమ్మె విరమించే అవకా శం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండుకోట్లకు పైగానే..
ఒక్కో మద్యం షాపుతో ఏడాదికి సుమారు రూ. 2 కోట్లకు పైగా ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి. ఇందులో పెద్ద మొత్తంలో మద్యాన్ని బెల్టు షాపులకు విక్రయించడం వల్లనే భారీగా ఆదాయం వసున్నదని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
దీంతో పాటు ప్రతి మద్యం దుకాణానికి ఒక పర్మిట్ రూంను అబ్కారీ శాఖ అనుమతిస్తున్నది. వీటిలో పల్లీ ప్యాకెట్లు మొదలుకుని ఇతర ఆహార పదార్థాలా వరకు విక్రయిస్తున్నారు. వీటిద్వారా ఒక్కో షాపుకు ఏడాదికి రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు అదనంగా ఆర్జిస్తున్నారు. వాటర్ బాటిళ్లు, గ్లాసుల విక్రయాలతో మరో రూ. ఐదు లక్షల వరకు సంపాదిస్తున్నారు. మద్యం షాపు ముందు పాన్షాపులు, ఇతర తినుబండారాలను విక్రయించే వారి దగ్గర నుంచి రోజుకు రూ. 500 వసూలు చేస్తారు. బార్లలో మద్యం ధరలు అధికంగా ఉండటం వల్ల మద్యం ప్రియులంతా వైన్ షాపుల వైపు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే.
మొదటి సారి ఎన్నారైలు ఎంట్రీ..
రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్నారైలు) మద్యం షాపుల కోసం పోటీ పడ్డారు. విదేశాల్లో ఉండి కష్టాలు పడటం కన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క వైన్ షాపు ఉంటే చాలన్న అభిప్రాయంతో పెద్ద ఎత్తున టెండర్లు వేశారు. వారితో పాటు ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగులు కూడా అప్పులు చేసి మద్యం షాపుల కోసం టెండర్లు వేయడం గమనార్హం. అదృష్టం వరిస్తే రెండేండ్లలో కోటీశ్వరులమవుతామన్న ఆలోచనలో ఉన్నారు.
దండిగా ఆదాయం
ఆబ్కారీ ఆదాయం మద్యం కిక్కుతో తడిసి ముద్ద యింది. మద్యం దుకాణాల దరఖాస్తుల రూపంలో జిల్లాలో దండిగా ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ శాఖ మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నది. 2017 సెప్టెంబర్లో మద్యం దుకాణా లకు దరఖాస్తుల రూపంలో రూ.411 కోట్ల ఆదా యం రాగా.. ప్రస్తుతం సరికొత్త మద్యం పాలసీ ద్వారా సుమారు రూ. 1000 కోట్ల రాబడి వచ్చింది. గత సీజన్తో పోలిస్తే దాదాపు నాలుగు రెట్ల ఆదా యం అధికంగా రావడం విశేషం. దరఖాస్తు ఫీజు గత సీజన్లో రూ.లక్ష ఉన్నప్పుడు మొత్తం 20,000 వేల దరఖాస్తులు రాగా, ప్రస్తుతం 48వేల దరఖా స్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుము రూ.2 లక్షలకు పెంచినా, ఊహించనిరీతిలో భారీగా అప్లికేషన్లు రావ డంతో ఆబ్కారీ శాఖ అధికారులే ఆశ్చర్యపోయారు.