Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆర్టీసీ నష్టాల్లో ఉంది. 44 శాతం ఉద్యోగులకు వేతనాలు పెంచినా సామర్ధ్యం మేరకు పనిచేయట్లేదు. పైపెచ్చు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు ప్రభుత్వం లొంగదు'' ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు చెప్తున్న మాటలు ఇవి. ''ఆర్టీసీ నష్టాల్లో లేదు. దానికి కార్మికులు కారణం కాదు. విధానపరమైన నిర్ణయాలు తీసుకొనే యాజమాన్యం, ప్రభుత్వానిదే ఆ బాధ్యత. వారి నిర్ణయాల్నే క్షేత్రస్థాయిలో కార్మికులు అమలు చేస్తారు. కార్మికులు కష్టపడకుండానే ఆర్టీసీకి అన్ని అవార్డులు, రివార్డులు ఎలా వస్తున్నాయి. పేరు ప్రతిష్టలు వస్తే ఆ ఘనకార్యం యాజమాన్యానిదీ, నష్టాలొస్తే భాధ్యత కార్మికులదా? ప్రభుత్వం ఆర్టీసీకి బాకీ పడిన నిధుల్ని ఇస్తే... నష్టాలనే మాటే ఉత్పన్నం కాదు'' కార్మిక సంఘాల వాదన ఇది.
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అసలు ప్రభుత్వం ఆర్టీసీని ఏం చేయదలుచుకున్నది అనేది ఇప్పటికే స్పష్టమైపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇదే ఆర్టీసీని ముక్కలు చేసి, ప్రయివేటుపరం చేయాలని తీవ్రమైన ప్రయత్నాలే చేశారు. వీటన్నింటినీ కార్మికులు, ప్రజలు పోరాటాలు చేసి కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతను ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు భుజానికెత్తుకున్నారు. రాష్ట్ర విభజనతో ఉమ్మడి ఆర్టీసీ ఇప్పటికే రెండు ముక్కలైంది. ఆముక్కల్ని మరిన్ని ముక్కలు చేయాలనేదే కేసీఆర్ లక్ష్యం. దీన్ని ఆయనేం తెరచాటుగా చెప్పట్లేదు. బహిరంగంగానే చెప్తున్నారు. కాకపోతే ఆర్టీసీ ఆస్తులపై తన కన్ను పడిందనే వాస్తవంపై మాత్రం నోరుమెదపట్లేదు. ఎందుకంటే ఇప్పటికే వరంగల్ టైర్ రీ ట్రేడ్ సెంటర్, హైదరాబాద్ నడిబొడ్డున బస్భవన్ పక్కనే ఉన్న ఖాళీస్థలాల్ని ఆయన తన అనుయాయూలకు కట్టబెట్టేసి, వేలకోట్ల ఆస్తుల్ని లీజు పేరుతో ఆక్రమించేశారు. ఇప్పుడు మియాపూర్లోని బస్బాడీ యూనిట్పై సర్కారు కన్ను పడింది. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో మందుల సరఫరాను ప్రయివేటుకు కట్టబెట్టారు. ఇప్పుడు కోట్ల రూపాయలు విలువ చేసే ఆ భూమిపై సర్కారు కన్ను పడింది. ఆస్పత్రిని అక్కడి నుంచి తరలిస్తామంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఈ దశలో అసలు తెలంగాణ ఆర్టీసీలో ఏం జరుగుతున్నది...వాస్తవాలు ఏంటి అనే విషయాలు తెలియచెప్పే ప్రయత్నమే ఇది...! ఈ కథనంలోని గణాంకాలన్నింటినీ ఆర్టీసీ యాజమాన్యం
అధికారికంగా ధృవీకరించింది.
ఇదీ ఉద్యోగుల లెక్క
ఆర్టీసీలో ఒక్క ఖాళీపోస్టును కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు. రెండేండ్ల క్రితం ఆర్టీసీలో 1950 పోస్టుల్ని భర్తీ చేశామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అదంతా పూర్తిగా కాగితాలపైనే ఉన్నది. ఒక్క ఖాళీపోస్టూ ఇప్పటి వరకు భర్తీ కాలేదు. కారుణ్యనియామకాల పేరుతో కొందరికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు. ఈ కేటగిరి కింద ఉద్యోగాలు రావల్సిన వారు ఇప్పటికీ యాజమాన్యం చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు.
2016లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 54,925 మంది. 2019 నాటికి వీరి సంఖ్య 50,078 కి తగ్గిపోయింది. అంటే రిటైర్డ్ అయిన ఉద్యోగుల సంఖ్య 4,847. ఈ లెక్కలు 2019 జూన్ వరకే...అక్కడి నుంచి ఈ నాలుగునెలల్లో మరో 1,250 మందికి పైగా రిటైర్డ్ అయ్యారు. అంటే మొత్తం ఖాళీలు దాదాపు 6,097పై మాటే. మరి వీరి పనిభారాన్ని ఎవరు మోయాలి? ఇక్కడే మరో ట్విస్ట్... సెక్యురిటీ పోస్టులు 2016లో 54 ఉంటే...వాటిని 2019 నాటికి 510కి పెంచారు. కారణం ఆర్టీసీ ఆస్తులకు కావలి ఉంచి, లీజుల పేరుతో వాటిని క్రమేణా స్వాధీనం చేసుకోవడం కోసమే!
ఇదీ పన్నుల లెక్క
ఆర్టీసీ నుంచి కేంద్రం, రాష్ట్రం వసూలు చేసుకుంటున్న పన్నుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజారవాణా కోసం సామాజిక బాధ్యతతో బస్సుల్ని తిప్పుతున్న ఆర్టీసీలో బస్బాడీలపై పన్నుల్ని విధిస్తున్నారు.
ఛాసిస్పై...
-జీఎస్టీ అమల్లోకి రాకముందు... బస్ ఛాసిస్పై 14 శాతం, ఎక్సైజ్ డ్యూటీ, ఆటోసెస్ 0.125 శాతం పన్ను వసూలు చేసేవారు. అంటే మొత్తంగా ఛాసిస్పై 14.125 శాతం పన్ను ఉండేది.
-2017లో జీఎస్టీ అమలోకి వచ్చాక ఛాసిస్పై పన్ను భారం 28 శాతానికి పెరిగింది. అంటే ఆర్టీసీపై అదనంగా 13.875 శాతం పన్ను భారం పడింది.
నిర్మించిన బస్సులపై
ఇక నిర్మాణ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీకి ముందు విధిస్తున్న పన్నులు ఇలా ఉన్నాయి. ఎక్సైజ్డ్యూటీ 12.5 శాతం, ఆటోసెస్ 0.125 శాతం, వ్యాట్ 14.5 శాతం, మొత్తం 27.125 శాతం, దీనికి ఎంట్రీట్యాక్స్ పేరుతో అదనంగా ఒక్కో బస్సు నిర్మాణంపై రూ.1,93,115 పన్ను వసూలు చేస్తున్నారు.
-జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ పన్ను 28 శాతానికి పెరిగింది. దానికి ఎంట్రీటాక్స్ అదనం. అంటే జీఎస్టీ వచ్చాక బస్సు నిర్మాణంపై పెరిగిన పన్ను 0.875 శాతం.
2014-15 నుంచి 2018-19 వరకు కట్టిన పన్నులు(కోట్లలో)
స్పేర్పార్ట్ వ్యాట్ ఎక్సైజ్ డ్యూటీ జీఎస్టీ మొత్తం
ఛాసిస్పై 26.24 21.05 9.38 56.67 కోట్లు
బస్బాడీపె 15.41 10.93 9.38 35.72 కోట్లు
బస్సీట్స్ 1.63 1.27 9.38 12.28 కోట్లు
గ్యాస్పై 8.7 7.91 -- 16.62 కోట్లు
మొత్తం 51.99 41.16 28.14 121.29 కోట్లు
నోట్ - ఈ రూ.121.29 కోట్లకు ఇతర కొనుగోళ్లపై కట్టిన పన్ను 110.71 కోట్లు
నికరంగా ఈ నాలుగేండ్లలో కట్టిన పన్ను 121.29110.71 232 కోట్లు.
ఇదీ బ్యాంకు అప్పుల లెక్క
ఇవీ ప్రభుత్వం చేయించిన అప్పులు
సంవత్సరం అసలు-వడ్డీ(రూ.) కేవలం వడ్డీ(రూ.)
2014-15 452 కోట్లు ---
2015-16 646 కోట్లు 138.30 కోట్లు 2016-17 673 కోటు 136.84 కోట్లు 2017-18 901 కోటు 168.70 కోట్లు
2018-19 809 కోట్లు 185.70 కోట్లు
మొత్తం 3,491 కోట్లు 629.54 కోట్లు
ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చుకోమని ఆదేశించింది. అప్పుకోసం అవసరమైన బ్యాంకు గ్యారంటీని ప్రభుత్వమే ఇచ్చింది. వాస్తవానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన సొమ్ము ఇది. దాన్ని ఇవ్వకపోగా ఆర్టీసీ యాజమాన్యంతో అప్పులు చేయించి, అసలు, వడ్డీల భారాన్ని సంస్థపైనే మోపింది. ఈ అప్పులన్నింటినీ ఆర్టీసీ పెంచుకున్న అంతర్గత ఆదాయంతోనే కడుతున్నది. ఇవి ప్రభుత్వం కంటికి కనిపించట్లేదు. పైపెచ్చు అప్పుల్లో ఉన్నారంటూ ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నది.
ఇవీ ఉద్యోగుల జీతభత్యాలు
ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఇస్తున్నామని, అప్పుడెప్పుడో (2015లో) 44 శాతం జీతాలు పెంచామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. ఆ పెంచిన తర్వాత కూడా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ డ్రైవర్లతో సమానంగా వేతనాలు రాలేదు. ఇద్దరూ చేసేది ఒకే పని అయినప్పుడు ఈ వ్యత్యాసం ఎందుకు...అందుకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొమ్మనే డిమాండ్ను కార్మికులు లేవనెత్తారు. అక్కడితో ఆగని సీఎం కేసీఆర్ ఒక్కోరికి రూ.50వేలకు పైగా జీతాలిస్తున్నామని ప్రకటించారు. దీనితో ఆర్టీసీ కార్మికులు తమ పే స్లిప్పుల్ని చూపిస్తూ, ఆందోళనలకు దిగారు. దీనితో ముఖ్యమంత్రి ప్రకటనలోని డొల్లతనం వెల్లడైంది. దాదాపు 54వేల మంది పనిచేస్తున్న సంస్థలో ఉద్యోగుల జీతాల కోసం యాజమాన్యం చేస్తున్న ఖర్చు ఇదీ...2019 నాటికి 54 వేల మందిలో దాదాపు 6వేల మందికి పైగా రిటైర్డ్ అయ్యారు. అంటే సంస్థ ఉద్యోగులు 48 వేలమంది పై చిలుకు మాత్రమే! రిటైర్డ్ అయిన వారిస్థానంలో కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టకపోవడం వల్ల ఆ ఆరువేల మంది వేతనాలు యాజమాన్యానికి మిగిలిపోయాయి. వారి పనిభారాన్ని మాత్రం ఉన్నవారిపై వేశారు.
ఇదీ ఉద్యోగుల వేతనాల ఖర్చు
సంవత్సరం జీతభత్యాలు(రూ.)
2015-16 2,699.03 కోట్లు
2016-17 2,174.34 కోట్లు
2017-18 2,203.14 కోట్లు
2018-19 (జూన్ వరకు) 2,440.07 కోట్లు
(రిటైర్డ్ అయిన ఉద్యోగుల సంఖ్యను తీసేశాక 2015-16తో పోల్చితే పెరిగిన జీతభత్యాలు కేవలం 1.35 శాతం మాత్రమే. ప్రభుత్వం మాత్రం 44శాతం పెంచామని ప్రచారం చేసుకుంటున్నది)
డీజిల్పై పన్నుతో దోచేస్తున్నారు|
సంవత్సరం ఆయిల్పై ఖర్చు(రూ.) చెల్లిస్తున్న పన్నులు(రూ.)
2015-16 974.16 కోట్లు 252.84 కోట్లు
2016-17 1,070.01 కోట్లు 265.52 కోట్లు
2017-18 1,191.37 కోట్లు 301.64 కోట్లు
2018-19 1,383.70 కోట్లు 319.94 కోట్లు
మొత్తం 4,619.08 కోట్లు 1,139.94 కోట్లు
( ఆయిల్పై ఖర్చు 2015-16లో 19.80 శాతం ఉంటే, 2018-19 నాటికి 31.87 శాతానికి పెరిగింది. అంటే ఈ నాలుగేండ్లలో అదనంగా 12.07 శాతం పెరిగింది)
ఆర్టీసీ లక్ష కిలోమీటర్లు తమ బస్సుల్ని తిప్పుతుంది. డీజిల్ రేటు రూ.42 ఉన్నప్పుడు ధరను నిర్ణయించారు. ఇప్పుడు డీజిల్ ధర రూ.70కు పైగా ఉంది. అంటే ఒక లీటర్పై సగటున రూ.28కి పైగా భారం పడుతున్నది. ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరించాలనేది కార్మికసంఘాల డిమాండ్. దానికి సర్కారు ససేమిరా అంటున్నది. పెరిగిన ధరకు అనుగుణంగా రేటును నిర్ణయించరు...పెరిగిన భారాన్నీ మోయరు...మరి ఆ సొమ్మంతటినీ పన్నుల రూపంలో సర్కారు తన ఖాజానాలోకి మళ్లించుకుంటున్నది.
ప్రభుత్వ భాషలో ఆర్టీసీ నష్టాలు-సర్కారు ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీల సొమ్ము
సంవత్సరం నష్టం ఆర్టీసీకి సర్కారు ఇవ్వాల్సిన
రాయితీల సొమ్ము
2014-15 299.64 కోటు 528.31 కోట్లు
2015-16 1,150.48 కోట్లు 5
నోట్-ప్రభుత్వం చెప్తున్న నష్టాల మొత్తం రూ.3,876.97 కోట్లలో నుంచి ఆర్టీసీకి సర్కారు ఇవ్వాల్సిన రాయితీల సొమ్ము రూ.2,802.75 కోట్లు తీసేస్తే...మిగిలిన నష్టం రూ.1,074.22 కోట్లు. దీనిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆర్టీసీకి రూ.590 కోట్లు రావల్సి ఉంది. దాన్ని కూడా తీసేస్తే...సర్కారు చెప్తున్న నష్టం రూ.484.22 కోట్లు. ఇవీ వాస్తవాలు. గడచిన నాలుగేండ్లలో ఆర్టీసీ ప్రభుత్వానికి చెల్లించిన పన్ను అక్షరాలా రూ. 3,952 కోట్లు. ఇవి కాకుండా సర్కారు చేయించిన అప్పులకు కడుతున్న వడ్డీలు రూ.694 కోట్లు. ఆయిల్మీద వ్యాట్ కింద కట్టిన పన్ను రూ. 1,234 కోట్లు. ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్రానికి చెల్లించిన పన్ను రూ.1,375 కోట్లు. సర్కారు వసూలు చేస్తున్న ఈ పన్నుల్లో కొంతైనా మినహాయించుకుంటే...ఆ నష్టం కూడా మాఫ్ అయ్యి...సంస్థ లాభాల్లో ఉంటుంది.
అద్దెబస్సుల వల్ల ఆర్టీసీకి వస్తున్న నష్టం
భూములు తాకట్టు ప్రభుత్వం చేయించిన అప్పులు
1. ఉప్పల్ జోనల్ వర్క్షాప్ రూ.175 కోట్లు - కెనరాబ్యాంక్
2. జూబ్లీబస్స్టేషన్ రూ.650 కోట్లు - ఆంధ్రాబ్యాంక్
3. హయత్నగర్1,2 రూ.100 కోట్లు - ఇండియన్బ్యాంక్
4. కరీంనగర్ జోనల్ వర్క్షాప్ రూ.425 కోట్లు - హడ్కో
5. బర్కత్పురా రూ.45 కోట్లు - ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
ఆర్టీసీలో 30 శాతం అద్దె బస్సుల్ని పెడతామంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆర్టీసీలో 2,190 ఆద్దె బస్సులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల ఆదాయంతో పోల్చితే ఒక్కో అద్దెబస్సు ట్రిప్పుపై సగటున రూ.2,577 నష్టం వస్తున్నది. 30 శాతం బస్సులతో ఇంకెంత నష్టం వస్తుందో...అద్దె బస్సుల యజమానుల్ని ఎలా పోషించొచ్చో అర్ధం చేసుకోవచ్చు.
- సెస్ పేరుతో ప్రయాణీకుల నుంచి ప్రభుత్వం వసూలు చేసిన పన్ను నాలుగేండ్లలో రూ.79.10 కోట్లు.
ఈ భూముల కోసమే...
ప్రయివేటు మంత్రం
ఆర్టీసీకి కేవలం రూ.4,450 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయని ఓ మంత్రివర్యులు సెలవిచ్చారు. ఆయన క్రీస్తుపూర్వం నుంచి క్రీస్తుశకం లోకి రాలేదని తెలుస్తున్నది.
రాష్ట్ర విభజనకు ముందు 2012-13 నాటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వాల్యుయేషన్ ప్రకారం ఆనాటి లెక్కలు అవి. బహిరంగ మార్కెట్ ధర దానికి ఎన్నో రెట్లు అధికం. రాష్ట్ర విభజన జరిగాక, కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక, రియల్ బూమ్ పెరిగాక, ఇప్పుడు ఆ భూముల బహిరంగ మార్కెట్ విలువ ఎంతుంటుందో సదరు సర్కారు పెద్దలే లెక్కలు కట్టుకోవాలి. కేవలం ఆర్టీసీని తక్కువ చేసి మాట్లాడటం కోసమే ప్రభుత్వంలోని కొందరు బంగారు తెలంగాణ బ్యాచ్ మంత్రులు ఈ తరహా ప్రచారం చేస్తున్నారని కార్మిక సంఘాలు ఇప్పటికే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎంతలేదన్నా ఇప్పుడున్న బహిరంగ మార్కెట్ లెక్కల ప్రకారం ఈ భూముల విలువ దాదాపు రూ.70 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఇవీ ఉమ్మడి జిల్లాల వారీగా ఆర్టీసీ భూముల లెక్కలు
(2012-13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల విలువ ప్రకారం)
వరుస సంఖ్య జిల్లా భూ విస్తీర్ణం 2012-13
ఎస్ఆర్ఓ విలువ
1. వరంగల్ 118.5 237.02 కోట్లు
2. ఖమ్మం 104.83 221.04 కోట్లు
3. నల్గొండ 116.08 181.14 కోట్లు
4. కరీంనగర్ 194.36 562.42 కోట్లు
5. ఆదిలాబాద్ 97.52 101.98 కోట్లు
6. నిజామాబాడ్ 134.20 172.15 కోట్లు
7. హైదరాబాద్ 134.09 2,016.48 కోట్లు
8. రంగారెడ్డి 250.72 649.79 కోట్లు
9. మహబూబ్నగర్ 141.72 138.58 కోట్లు
10. మెదక్ 112.76 170.23 కోట్లు
మొత్తం భూమి 1,404.79 4,450.87కోట్లు
(ఇది 2012-13ఎస్ఆర్ఓ విలువ ప్రకారం -
ప్రస్తుత బహిరంగ మార్కెట్లో ఈ విలువ రూ.70వేల కోట్లకు పైనే)