Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్షాలు, టీజేఎస్, ఇంటిపార్టీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం శాంతియుతంగా రాష్ట్రబంద్ చేపట్టిన వామపక్ష పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు, తెలంగాణ జనసమితి (టీజేఎస్), తెలంగాణ ఇంటిపార్టీ తీవ్రంగా ఖండించాయి. అక్రమ అరెస్టులకు నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని పిలుపునిచ్చాయి. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో తమ్మినేని వీరభద్రం, బి.వెంకట్ (సీపీఐఎం), చాడ వెంకటరెడ్డి, బాల మల్లేష్, (సీపీఐ), కె రమ, సూర్యం (న్యూడెమోక్రసీ), కె గోవర్ధన్, సంధ్య (న్యూడెమోక్రసీ), సుధాకర్(ఎంసీపీఐయూ), మురహరి (ఎస్యూసీఐసీ), ప్రసాద్ (సీపీఐఎంఎల్), రాజేష్ (సీపీఐఎంఎల్ లిబరేషన్), జానకిరాములు (ఆరెస్పీ), కోదండరామ్ (టీజేఎస్), చెరుకు సుధాకర్ (ఇంటిపార్టీ) పాల్గొన్నారు. అనంతరం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర బంద్ను విజయవంతం చేసిన ప్రజలకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రబంద్లో న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు బొటనవేలు తెగిపోవడం, ఇతర కార్యకర్తలపై జరిగిన పోలీసుల దాష్టికాన్ని ఖండించారు.