Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శనివారం జేఏసీ ప్రతినిధి ఉపేంద్ర సీఈఓ రజత్కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి, అభ్యర్థి పద్మావతిరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్రెడ్డి ఎన్నికల నియామళిని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ ముగ్గురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామన్నారు.