Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవాంఛనీయ ఘటనలేమీ జరగలేరన్న పోలీసులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసి జేఏసీ, ప్రతిపక్షాలు శనివారం పాటించిన రాష్ట్ర బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేవు. బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరువేల మందికి పైగా ఆందోళకారులను అరెస్టు చేసి వదిలివేశామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లతో పాటు ఇతర నగర కమిషనరేట్లు, జిల్లాల్లో బస్సు డిపోలు, రహదారులు, చౌరస్తాల వద్ద ఆందోళనకారులను అరెస్టు చేశామన్నారు. అరెస్టయిన వారిలో ఆర్టీసి జేఏసీ నాయకులతోపాటు సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్ మొదలైన పార్టీల నాయకులు, కార్యకర్తలున్నారని తెలిపారు. వీరిపై సీఆర్పీసీ, ఐపీసీ సెక్షన్ల కింద 120కి పైగా కేసులను వివిధ ప్రాంతాల పోలీసుస్టేషన్ల పరిధులలో నమోదు చేశామన్నారు. మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయనీ, వాటి వివరాలు అందాల్సి ఉందని తెలిపారు. బంద్ సందర్భంగా పోలీసుయంత్రాంగా సంయమనంతో వ్యవహరించినట్టు తెలిపారు.