Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పవర్ ప్రాజెక్టుల పేరుతో రుణాలు
- రూ.185 కోట్లు తీసుకుని మోసం
నవతెలంగాణ - పంజాగుట్ట
దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్టుల పేరుతో బ్యాంకుల నుంచి రూ.185 కోట్ల రుణం తీసుకుని మోసగించిన వ్యక్తిని హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పంజాగుట్ట సీఐ కరుణాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన చదలవాడ రవీంద్రబాబు 2004లో హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో చదలవాడ ఇన్ఫ్రాటెక్ సంస్థ స్థాపించాడు. తన సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ఇస్తానని పలువురిని నమ్మించి పెట్టుబడులు పెట్టించాడు. రవీంద్రబాబు అనే వ్యక్తి బాల్య స్నేహితుడు మోహన్రావు 2011లో రూ.2.20 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. లాభాలు రాకపోగా అసలు కూడా ఇవ్వకపోవడంతో 2015లో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను మోహన్రావు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పెట్టుబడుల పేరుతో మాత్రమే కాకుండా రవీంద్రబాబు ఖాళీ స్థలాలను తక్కువ ధరకే ఇప్పిస్తానని పలువురిని నమ్మించి మోసగించినట్టు విచారణలో తేలింది. దాంతోపాటు పవర్ప్రాజెక్టుల పేరుతో బ్యాంకుల నుంచి రూ.185కోట్లు తీసుకుని, రెండు సార్లు మాత్రమే వాయిదాలు చెల్లించాడు.