Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఈఎస్ఐ ఐఎంఎస్ మందుల కొనుగోళ్ల స్కాంలో నిందితురాలైన ఈఎస్ఐ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పద్మ.. జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈఎస్ఐ ఐఎంఎస్కు సంబంధించిన కోట్లాది రూపాయల మందుల కొనుగోల్మాల్ స్కాంలో పద్మను ఇటీవలే అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్గూడ కేంద్ర కారాగారంలో ఆమె ఉన్నారు. అరెస్టయ్యాక రెండు రోజులపాటు ఆమెను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు కూడా. ఆమె నుంచి ఈ స్కాంలో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించారు. తర్వాత జైలుకు తరలించారు. కాగా శనివారం ఆమె తానున్న బ్యారక్లో అపస్మారక స్థితిలో కనిపించగా మహిళా జైలు అధికారులు వెంటనే ఉస్మానియా ఆస్పత్రిలోని మహిళా జైల్ వార్డ్లోకి చికిత్స కోసం తరలించారు. ఆమె అధిక మొత్తంలో స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నట్టు జైలువర్గాలు తెలిపాయి. కాగా, డాక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని ఈ జైలుపరిధికి చెందిన మాదన్నపేట్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. ప్రస్తుతం నిందితురాలి ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నదని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.