Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్/బయ్యారం
జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో పురుగుల మందు తాగి ఒకరు, విద్యుద్ఘాతానికి గురై మరొక రైతు శనివారం మృతిచెందారు. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కేజీ తండా చెందిన భూక్య ధర్మ(35) పన్నెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. పత్తి, వరి సాగు చేశాడు. కొన్నేండ్లుగా దిగుబడులు రాకపోవడంతో పాటు పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన ధర్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బండ్లకుంట సమీపంలో శుక్రవారం రాత్రి వీచిన గాలులకు విద్యుత్ తీగలు తెగి నేలపై పడ్డాయి. అదే గ్రామానికి చెందిన రైతు పడిగ లక్ష్మయ్య(55) ఉదయాన్నే పొలం వద్దకు వెళ్తుండగా తీగలు కాలికి తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.