Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీపీఓ వద్ద బీజేపీ ఆందోళన, నేతల అరెస్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పదవులు శాశ్వతం కాదనీ, ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న సమ్మె పట్ల మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్, కేటీఆర్ పెదవి విప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ సూచించారు. హైదరాబాద్లోని ఆబిడ్స్లోని జీపీఓ వద్ద బీజేపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్రావు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, తదితరులను అరెస్టు చేశారు. ఆందోళనుద్దేశించి లక్ష్మణ్ మాట్లాడుతూ...ఆనాడు ఉద్యమంలో పాల్గొనని వాళ్లని ద్రోహులని అన్నామనీ, ఇప్పుడు మీరూ ద్రోహులేనా అని ప్రశ్నించారు.