Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎంఎస్ఆర్యూ ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటీటివ్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుకు మద్దతుగా యూనియన్ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన ప్రదర్శనను ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటీటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఆర్ఏఐ) కార్యదర్శి కె.సునీల్ కుమార్, టీఎంఎస్ఆర్యూ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఎ.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఐ.రాజుభట్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతో సహా 26 న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు మద్దతు సభ్యులు నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టే భవిష్యత్ కార్యక్రమాలకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.