Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి ఎన్యూబీడబ్ల్యు లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్ధికంగా జీర్ణావస్థకు చేరుతున్న బీఎస్ఎన్ఎల్ను పునరుజ్జీవింపచేయాలని నేషనల్ యూనియన్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్ వర్కర్స్ సర్కిల్ కార్యదర్శి మహ్మద్ రఫీక్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాసారు. బీఎస్ఎన్ఎల్ను అప్పటి ప్రధాని వాజ్పేయి ఏర్పాటు చేశారని, అప్పట్లో సంస్థ పరిరక్షణ కోసం ఆర్ధికపరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని, ప్రభుత్వరంగ సంస్థను మరింత నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిపట్ల ఉద్యోగులు ఏమాత్రం సంతోషంగా లేరని, వారికి నెలవారీ వేతనాలు కూడా సక్రమంగా అందట్లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. గ్రామీన ప్రాంతాల్లోని ఎక్సేంజ్లకు ఆర్ధిక సహాయాన్ని అందించాలని, 4జీ స్పెక్ట్రంను ఎలాంటి షరతులు లేకుండా బీఎస్ఎన్ఎల్కు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు మెడికల్ సౌకర్యాల పరిమితిని పొడిగించాలని, 2017 నుంచి అమల్లోకి రావల్సిన వేతన సవరణను తక్షణం ప్రకటించాలని కోరారు. దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసేలా ప్రధాని నిర్ణయాలు తీసుకోవాలని ఆ లేఖలో ఆకాంక్షించారు.