Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు రాజకీయపార్టీలతో సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బంద్కు సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు టీఎస్ఆర్టీసీ జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. ఆదివారం అన్ని డిపోలు, ప్రధాన కూడళ్ల వద్ద ఆర్టీసీ కార్మికులు ప్రజలకు పుష్పగుఛ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలిపి, భవిష్యత్ పోరాటాలకోసం మద్దతును అభ్యర్ధిస్తారని జేఏసీ కన్వీనర్ ఈ అశ్వత్థామరెడ్డి (టీఎమ్యూ), కో కన్వీనర్లు కె రాజిరెడ్డి (ఎంప్లాయీస్ యూనియన్), వీఎస్ రావు (స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్), ఓ సుధ (సూపర్వైజర్స్ అసోసియేషన్) తెలిపారు. ఆదివారం అన్ని రాజకీయపార్టీలతో సమావేశాన్ని నిర్వహించి, తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. కోర్టు అదేశాల మేరకు ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కోర్టు ఉత్తర్వులు అందలేదనే సాకుతో ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తున్నదని విమర్శించారు. రవాణాశాఖ కార్యదర్శి సునీల్శర్మ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో అవాస్తవాలు, తప్పుడు లెక్కల్ని పేర్కొన్నారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా అప్పటి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదన్నారు. సీఎం కేసీఆర్ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లుతున్నదని చెప్పారు.