Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు తీర్పు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
క్రిమినల్ కేసుల్లో నిర్ధోషులుగా బయటపడిన వాళ్లు కూడా పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులకు ఎంపిక చేయకపోవడం సబబేనని హైకోర్టు తీర్పు చెప్పింది. నేరాభియోగాలు కూడా మచ్చ వంటిదేనని న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్రావు తీర్పు చెప్పారు. నారాయణ్ఖేడ్ మండలం రాయకల్లు గ్రామ వాసి కష్ణకుమార్ అనే ఎస్టీకి చెందిన యువకుడు 2015 డిసెంబర్లో వెల్లడైన నోటిఫికేషన్ తర్వాత జరిగిన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. అతని పేరును కానిస్టేబుల్ ఎంపిక జాబితాలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టింది. అయితే అతనిపై క్రిమినల్ కేసు ఉందని తెలియడంతో ఎంపికను రద్దు చేసింది. ఈ మేరకు బోర్డుతోపాటు మెదక్ ఎస్పీ కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత కింది కోర్టు కేసు కొట్టేస్తూ తీర్పు చెప్పింది. కాబట్టి కానిస్టేబుల్ సెలక్షన్ అయ్యేలా హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. రిట్ను విచారించిన హైకోర్టు క్రిమినల్ ఆరోపణలు కోర్టులో నిలవకపోయినా కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేయకపోవడం లేదా ఎంపికైన వాళ్లను రద్దు చేయడం చట్టబద్ధమేనని తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా పలు సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉదహరించింది.