Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం తీరుపై సీఎస్ మనస్థాపం ?
- ఆయన లేకుండానే సమ్మెపై సమీక్షలు
- రిటైర్మ్ంట్ వారికే ప్రాధాన్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''రాష్ట్రానికి ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే.. కానీ కీలక నిర్ణయాలన్నీ సీఎంఓ పరిధిలోనే జరుగుతున్నాయి. రిటైరైన అధికారుల సలహాలు, సూచనలే ప్రభుత్వానికి అవసరం. కనీసం సమీక్షా, సమావేశాలకు కూడా ఆహ్వానం ఉండదు. కొద్ది నెలలు ఇలాగే కాలం గడపాల్సిందే'' అని సీఎం తీరుపై రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలి సింది. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే కీలక పాత్ర ఉంటుంది. కానీ సీఎం కేసీఆర్ గత కొద్ది నెలలుగా సీఎస్తో అంటిముట్ట న్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలపై కూడా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ఇతర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శు లతోనే సీఎం చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కూడా రాజీవ్శర్మ, సునీల్శర్మ, అనురాగ్శర్మతోనే చర్చిస్తున్నారనీ, సీఎస్ను మాత్రం చర్చలకు ఆహ్వానించలేదు. గత 18 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా సీఎం ఏఒక్క రోజుకూడా సీఎస్తో పెద్దగా చర్చించిన దాఖలాలు లేవని సీఎంఓ వర్గాలే చెబుతున్నాయి. సమ్మెపై కోర్టు వేస్తున్న మొట్టికాయలపై కూడా రాజీవ్శర్మ, అనురాగ్శర్మతోనే చర్చిస్తున్నారనీ, సీఎస్ను పట్టించుకోవడం లేదని కొందరు సీఎంఓ కార్యాలయంలోని అధికారులు తెలిపారు.
అన్నీ తప్పుడు సలహాలే..
సీఎం కేసీఆర్కు కొందరు అధికారులు తప్పుడు సలహాలు ఇస్తున్నారనీ, వాటినే నమ్ముకుని సీఎం మొం డిగా వ్యవహరిస్తున్నారని కొందరు ఐఏఎస్ అధి కారులు వ్యాఖ్యానిస్తున్నారు.ఆర్టీసీ సమ్మెపై అసలే ఆగ్రహంగా ఉన్న కేసీఆర్కు.. అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తు న్నట్టు సమాచారం. దీంతోనే సీఎం కేసీఆర్ మరింత మొండిగా పోతున్నారనే చర్చలు చోటు చేసుకుంటు న్నాయి. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణ యాలు తప్పని తెలిసినా తమకెందుకులే అన్ని మిన్నకుంటున్నామని ఇతర సీనియర్ అధికారులు చెప్పారు.
సీఎం చుట్టూ ఉంటూ కొందరు భజనపరులు చేరి ఆయనకు తప్పుడు నివేదికలు అందజేస్తున్నారని వ్యాఖ్యానించారు. వారి వల్లనే తాము ఇబ్బందులు పడాల్సివస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఇతర ముఖ్యమైన ఆదేశాలను ఎప్పటికప్పుడు జారీ చేసి అప్రమత్తం చేసేందుకు సీఎంఓలోని ఒక ఐఏఎస్ అధికారే కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు ఫోన్లు, వ్యాట్సప్ల ద్వారా సమాచాన్ని తీసుకుని సీఎంకు చేరవేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెపై కూడా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుని దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెపై జిల్లా అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారనీ, ఈ కారణంతోనే ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులతో సీఎం చర్చలు జరపడం లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. సీఎంతో తమకెందుకులే బాధ అన్న రీతిలో జిల్లా అధికారులు కూడా ఆర్టీసీ సమ్మె ప్రభావం పెద్దగా లేదంటూ పాజిటీవ్ రిపోర్ట్ ఇస్తున్నట్టు సమాచారం.