Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోనరావుపేట, గూడురు
అప్పుల బాధ భరించలేక వ్యవసాయ బావిలో దూకి ఒకరు, పురుగుల మందు తాగి మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘట నలు రాజన్నసిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం జరి గాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామం లో ఎరవెల్లి సామెల్ తన ఎకరంన్నర భూమిలో పత్తి పంట వేశాడు. వరు సగా కురిసిన వర్షాలతో పొలంలో నీరు నిలిచి ఎర్రబొమ్మడి తెగులు వచ్చి పంట మొత్తం నల్లబడింది. పంట చేతికచ్చేలా లేకపోవడం, పెట్టుబడి కోసం చేసిన సుమారు రూ.3లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి పొలం వద్దకు వెళ్లొస్తానని చెప్పి బయల్దేరిన అతను.. మంగళవారం ఉదయం పొలం వద్ద బావిలో సామిల్ (40) మృతదేహమై కనిపించాడు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పైకి తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు. మృతుడికి భార్య లలిత, కుమారుడు ఉన్నారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామం మర్ల బీరయ్య (38)కు నాలుగెకరాల భూమి ఉంది. కొన్నేండ్లుగా పంటలు పండక తెచ్చిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్మ చేసుకున్నాడు. మృతునికి ఇద్దరు కుమారులున్నారు.