Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీటీబీఈఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతంగా జరిగిందని ఏపీటీబీఈఎఫ్ గౌరవాధ్యక్షులు సురవరం సుధాకర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సమ్మె నిర్వహించిన బ్యాంకు ఉద్యోగులను ఆయన అభినందించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయం ప్రకారం బ్యాంకుల విలీనాన్ని ఆపాలని, ఉన్న బ్యాంకులను అలాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు.