Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ స్థాయిలో ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికైన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం అభినందించారు. వివిధ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో అభివద్ధి పనులను పరిశీలించిన ఢిల్లీలోని చాణక్య ఫౌండేషన్ పరకాలను ఉత్తమ నియోజకవర్గంగా ఎంపిక చేసింది. గతనెల 26న ఢిల్లీలో కేంద్రమంత్రి రామేశ్వర్ తేలి, పద్మ విభూషణ్ మురళీ మనోహర్ జోషి చేతుల మీదుగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.