Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ :తెలంగాణ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సదస్సు ఈ నెల 26 నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఉపాధ్యక్షులు మోెతుకూరు నరహరి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని లక్డీకాపూల్ బీఎస్ఎన్ఎల్ హాల్లో జరిగే సదస్సులో పెన్షనర్స్, రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నవంబర్ 1,2 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జాతీయ మహాసభలు రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో జరుగనున్న నేపథ్యంలో సన్నాహకంగా రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు వివరించారు.