Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షైన్ ఆస్పత్రి ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక: రంగారెడ్డి అడిషనల్ హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్
నవతెలంగాణ-హయత్నగర్
షాట్ సర్క్యూట్తోనే షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగిందని రంగారెడ్డి అడిషనల్ హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్ వెల్లడించారు. ఈ నెల 21న తెల్లవారుజామున ఆస్పత్రిలోని ఎన్ఐసీయూ కేర్ వార్డులో షార్ట్సర్క్యూత్తో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి మంటలు చేలరేగాయి. దీంతో వార్డులోని ఐదుగురు చిన్నారుల్లో నాలుగు నెలల బాలుడు (విక్కీ) మంటలు అంటుకుని మృతిచెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆస్పత్రిని అధికారులు సీజ్ చేసి విచారణ చేపట్టారు. మంగళవారం ఆస్పత్రి పరిస్థితులు, ప్రమాద కారణాలను అధికారులు పరిశీలించారు. రవీంద్రనాయక్తో పాటు ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ప్రీత్సింగ్, ఎల్బీనగర్ డివిజనల్ ఏసీపీ పృథ్వీధర్రావు ఆస్పత్రిలో షాట్సర్క్యూట్కు గల కారణాలను పరిశీలించారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. ఎల్బీనగర్ రింగ్ రోడ్ వద్ద ఉన్న షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిని 2014లో ఎండీ సునిల్కుమార్రెడ్డి ప్రారంభించారని చెప్పారు. ఈ భవన విస్తీర్ణం 400 చదరపు గజాలని, జీ+2 వరకు మాత్రమే అనుమతి పొంది మరో అంతస్తును అదనంగా నిర్మించారని తెలిపారు.
ఫిజికల్ విజిటింగ్ మరిచిన అధికారులు
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు నిర్మాణదారులకు అనుమతులిచ్చే సమయంలో ఫిజికల్ విజిటింగ్ చేస్తే ఇంతటి ప్రమాదం జరిగేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం సమయంలో ఆస్పత్రిలో మొత్తం 45మంది చిన్నారులు చికిత్స కోసం వచ్చారని సమాచారం. అయితే, ప్రమాదం తరువాత 24 మందిని వివిధ పిల్లల ఆస్పత్రులకు తరలించారు.
ఆస్పత్రికి ఫైర్సేఫ్టీ ఉంది: ఎండీ సునీల్కుమార్
ఆస్పత్రికి ఫైర్సేఫ్టీ ఉండటంతో మిగతా గదులకు మంటలంటుకోలే దు. సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమా దం తప్పింది. ఈ ఘటనతో చిన్నపిల్లలు గాయపడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులకు తామే బిల్లులు చెల్లిస్తాం.
సుమోటోగా కేసు
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదంపై బాలల హక్కుల పరిషత్ సంఘం సుమోటోగా కేసు స్వీకరించింది. సంఘం సభ్యులు పోనుగంటి అంజన్రావు, అపర్ణ, బృందాకర్ మంగళవారం ఆస్పత్రిని పరిశీలించారు. ఘటనపై ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఈ విషయమై మానవహక్కుల సంఘంలో పిటిషన్ దాఖలు చేశారు.