Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్
ప్రభుత్వం తీరుతో మరో ఆర్టీసీ కార్మికుడి గుండే ఆగింది. సమ్మె చేపట్టి 18 రోజులవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతోపాటు, వేతనాలు అందజేయక పోవడంతో మనోవేదనకు గురై ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం గోలిలింగాల్లో మంగళవారం జరిగింది. బాధిత కుటుంబీకుల వివరాల ప్రకారం.. మహమ్మద్ గఫ్రొద్దీన్ (36) నిజామాబాద్-2 డిపోలో ఆర్టీసీ డ్రైవర్. సమ్మె కొనసాగుతున్నా ప్రభుత్వం మొండివైఖరితో వ్యవహరించడం, వేతనాలు ఇంకా అందజేయకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆయన.. వేతనాలు ఇచ్చేందుకు ఆర్టీసీ వద్ద డబ్బులు లేవనే ప్రకటన చూసినప్పటి నుంచి బెంగ పెట్టుకున్నాడు. దీంతో గుండెపోటు రాగా, కుటుంబీకులు చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్య లో మృతిచెందాడు. అతనికి భార్య పర్వీన్, ఆరు నెలల కుమార్తె హైజా ఫాతిమా ఉన్నారు.