Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా..
- దీపావళి రోజు ఆర్టీసీ కార్మికులను ఇండ్లకు ఆహ్వానించాలి
- నవంబర్ 9న మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్
రాష్ట్ర మహాసభ : ఖమర్అలీ, పాలడుగు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిధి వసూలు చేయనున్నట్టు, దానిని జిల్లాల్లో ఆర్టీసీ జేఏసీలకు అందజేయనున్నట్టు మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖమర్అలీ, పాలడుగు భాస్కర్ తెలిపారు. ఆ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరిని విడనాడి ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీతాలు వేయకపోవడాన్ని నిరసిస్తూ దీపావళి పండుగ రోజు ఆర్టీసీ కార్మికులను మున్సిపల్ కార్మికులు ఆహ్వానించి భోజనం పెట్టాలని పిలుపునిచ్చారు. కొత్త మున్సిపాల్టీల్లోనూ జీఓ నెంబర్ 14 ప్రకారం సమానంగా వేతనాలు చెల్లించాలనీ, పీఎఫ్, ఈఎస్ఐలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 6న మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలనీ, మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీలో రూ.24 వేలు వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మూడో మహాసభలు నవంబర్ 9వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఆ మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణను నిర్వహించబోతున్నామని తెలిపారు.