Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ల్యాండ్ బ్యాంకు వివరాలను సిద్ధం చేసుకోవాలి : పట్టణాభివృద్ధి సంస్ధల సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రానున్న కాలంలో పల్లెల కన్నా పట్టణాల్లోనే మెజార్టీ జనాభా ఉండబో తున్నదనీ, అందుకు తగినట్టుగా మాస్టర్ ప్లాన్, భవిష్యత్ అవసరాల కోసం ల్యాండ్ బ్యాంకు వివరాలను సిద్ధం చేసుకోవాలనీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో గురువారం పట్టాణా భివృద్ధి సంస్థల చైర్మెన్లు, అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశమ య్యారు. భవి ష్యత్తు అవస రాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్లను తయారు చేయడం పట్ట ణాభివృద్ధి సంస్థల ప్రాథమిక విధి అనీ, ఈ దిశగా కార్యచరణ ప్రారంభించాలనీ కోరా రు. పట్టణ అవసరాలకు తగినట్టు గ్రీన్ జోన్, ఇండిస్టియల్ జోన్ల లాంటి జోనింగ్ల ఏర్పాటు అంశాలను పరిగణలోకి తీసుకో వాలన్నారు. వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రచురణకు సిద్దంగా ఉన్నదని, దీనిపై శుక్రవారం డీటీ సీపీ, మున్సిపల్ శాఖాధికారులతో సమా వేశం కావాలని చైర్మెన్లు, అధికారులను కోరారు. స్వయం సమృద్ధి సాధించే దిశగా పని చేయాలని, ఇందు కోసం ల్యాండ్ పూలింగ్, అభివృద్ధి విధానం లాంటి మార్గా లను అనుసరిం చాలని మంత్రి సూచిం చారు. ప్రభుత్వ భూములు, ప్రయివేటు భూములు, అటవీ భూములతో కూడిన ల్యాండ్ బ్యాంకుల సమగ్ర వివరాలను సిద్దంగా ఉంచాలన్నారు. హెచ్ఎండీఏ 7600 చదరపు కిలో మీటర్ల పరిధిలో వినూత్నమైన విధానాలు, కార్య క్రమాలతో పనిచేస్తు న్నదని, ఆ సంస్థ అనుభవాల ఆధారంగా రాష్ట్రంలోని మిగిలి న పట్టణాభి వృద్ధి సంస్ధలు పని చేయాలని సూచిం చారు. నూతనంగా ఏర్పడిన మున్సి పాలిటీలకు ఎల్అర్ఎస్ కార్యక్రమా న్ని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అక్రమ లేఅవుట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశిం చారు. పట్టణాభివృద్ధి సంస్ధల చైర్మెన్లు మర్రి యాదవరెడ్డి (వరంగల్), జివి రామకృష్ణారావు (కరీంనగర్), రవీందర్ రెడ్డి (సిద్దిపేట), ప్రభాకర్రెడ్డి (నిజామా బాద్)తో పాటు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్ పాల్గొన్నారు.
గిరిజన పారిశ్రామికవేత్తలకు రుణపత్రాలు
శిక్షణ పొందిన గిరిజన పారిశ్రామికవేత్త లకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రుణపత్రాలు అందజేశారు. నగరంలోని గచ్చిబౌలి ఐఎస్బీలో సీఎంఎస్టీ ఎంట్రర్ప్రిన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ కార్యక్రమం గురువారం జరిగింది. కటీఆర్, సత్యవతి రాథోడ్ హాజర య్యారు. పెద్ద పరిశ్రమలతో పోల్చితే చిన్న తరహా పరిశ్రమలే ఎక్కువ ఉద్యోగాలను కల్పిస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కావాల్సిన నిధుల్లో 35 శాతం సబ్సిడీ ఇవ్వనుంది.