Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీటెక్ విద్యార్థిని, ఓ వ్యక్తి
నవతెలంగాణ-హవేళీఘణపూర్/తల్లాడ
జ్వరంతో ఇద్దరు మృతిచెందారు. వీరిలో మెదక్ జిల్లా హవేళీఘణపూర్ మండలం నాగపూర్ గ్రామానికి ఇంజినీరింగ్ విద్యార్థిని కూడా ఉంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ వైద్యశాఖ ఉద్యోగి నరేందర్రెడ్డి-మంజుల దంపతుల కుమార్తె భవ్యారెడ్డి(21) నర్సాపూర్ బీవీఆర్ ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్సీ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదివింది. ఇటీవల క్యాంపస్ సెలక్షన్స్లో ఇన్ఫోసిస్ కంపెనీకి సెలెక్టయింది. ఐదు రోజులు జ్వరంతో బాధపడటంతో మొదట మెదక్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చారు. తగ్గకపోవడంతో హైదరాబాద్లోని కొంపల్లి రష్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి పంపించారు. అక్కడ డెంగ్యూకు చికిత్స చేసినా ఫలితం లేక పరిస్థితి విషమించి మృతిచెందింది. స్వగ్రామంలో నిర్వహించిన విద్యార్థిని అంత్యక్రియల్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన గొడ్ల సాయి(26)కు వారం రోజుల కిందట జ్వరం రావడంతో ఖమ్మంలోని ఓ ప్రయి వేటు ఆస్పత్రిలో చేర్పించారు. తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరా బాద్ తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందాడు.