Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గత 44 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా, ఇప్పటికి 24 మంది కార్మికులు మరణించిన ప్రభుత్వంలో చలనం రాకపోవడం బాధాకర మన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిమాండ్లలో ఆర్టీసీ జేఏసీ ఒక మెట్టు దిగినా ప్రభుత్వం వారిని చర్చలకు పిలకపోవడం సమంజసం కాదన్నారు. సమ్మెవల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ వాలకం చూస్తుంటే ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి కోర్టుకు నివేదించిన ప్రతిలో అన్నీ అబద్ధాలే చెపడం గమనార్హమన్నారు.