Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సాపూర్(జి)
కుటుంబం గడవక..ఫీజు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోయిన డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. ఎస్సై వెంకటరమణ, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...నర్సాపూర్(జి)కు చెందిన కందిగిరి నవనీత్ (21) హైదరాబాద్లోని ఓ ప్రయివేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి ఐదేండ్ల కిందట బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లాడు. తండ్రి సౌదీలో ఉన్నా ఇంటి పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తల్లి ఇంటి వద్దనే ఉంటోంది. వీరి కుటుంబాన్ని కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. దీంతో నవనీత్ కళాశాలలో ఫీజులు చెల్లించలేకపోయాడు. చదువుకోలేక, కళాశాలలో ఫీజులు చెల్లించక తోటి విద్యార్థులకు మొహం చూపించలేక లోలోపల కుమిలిపోయాడు. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.