Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సునిల్ శర్మ ఐఏఎస్ ఆఫీసరో? టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శినో? చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. హైదరాబాద్లో ఆయన ఆదివారం మీడియా తో మాట్లాడారు. ఇంట్లో నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో-కన్వీనర్ రాజిరెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండించారు.
ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంతలా దిగజారడం దేశంలో తానెక్కడా చూడలేదన్నారు. సునిల్ శర్మ తప్పుడు సమాచారంతో కూడిన నివేదికలు అందజేస్తూ కోర్టును తప్పుడుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు, యూనియన్లు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదో యాలని చూస్తున్నాయని ఒక ప్రభుత్వాధికారి ఓ పార్టీకి ఎలా వత్తాసు పలుకుతారని ప్రశ్నించారు. అఫిడవిట్లో సునిల్శర్మ పేర్కొన్న వ్యాఖ్యలను హైకోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ జరపాలని కోరారు.