Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు కొడుకులతో కలిసి ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ-హాజిపూర్
స్టేషన్కు పిలిచిన ఎస్సై 'నీపై రౌడీషీట్ తెరుస్తున్నాం.. ఫొటోలు తీసుకుంటాం..' అని వేధించడంతో ఓ రైతు భయాందోళనకు గురయ్యాడు. పోలీస్స్టేషన్ లోపలి నుంచి బయటకు వచ్చి విషయాన్ని ముగ్గురు కొడుకులకు వివరించాడు. వెంటనే ఆ నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా హాజిపూర్ పోలీస స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. హాజిపూర్ మండలంలోని కర్ణ మామిడి గ్రామ రైతు కొట్టె వీరయ్య కు ఆరెకరాల భూమి ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్వాటర్లో ముంపునకు గురైన కర్ణమామిడి, పడ్తనపల్లి పునరావాస కాలనీలకు చెందిన మురుగునీరు వీరయ్య పొలం గుండా వెళ్తోంది. దీంతో అతని పొలం కోతకు గురవుతోంది. ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా స్పందించకపోవడంతో ఆ మురుగు నీటిని మళ్లించాడు. ఈ విషయమై కొందరు ఫిర్యాదు చేయడంతో వీరయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమో దైంది. ఈ క్రమంలో ఎస్ఐ చంద్ర శేఖర్ ఆదివారం వీరయ్యను పీఎస్కు పిలిపించాడు. పోలీస ్స్టేషన్కు వెళ్లగా నీపై కేసులున్న దృష్ట్యా రౌడీషీట్ తెరుస్తున్నామనీ, ఫొటోలు తీసుకుంటామనీ ఎస్ఐ హెచ్చ రించాడు. ఏం చేయాలో పాలుపోక జరిగిన విషయాన్ని ముగ్గురు కొడుకులు సంతోష్, చంద్రమౌళి, రాజులకు ఫోన్ ద్వారా చెప్పాడు. రైతునైన తనపై రౌడీషీట్ తెరవడ మేంటని ఆందోళన వ్యక్తం చేశాడు. ముగ్గురు కొడుకులు పురుగుల మందు డబ్బాతో స్టేషన్కు చేరు కోగా.. తండ్రితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన పోలీసులు హుటా హుటిన మంచిర్యాల ప్రభు త్వాస్పత్రికి తరలించారు. ఏసీపీ లక్ష్మీనారాయణ తోపాటు రూరల్ సీఐ కృష్ణకుమార్ ఆస్పత్రికి వెళ్లి బాధితుల నుంచి వివరాలు తెలుకున్నారు. ఘటనకు సంబంధించిన విచారణ చేపడతామని సీఐ వెల్లడించారు. అక్రమ కేసుల బనాయింపుపై విచారణ చేపట్టాలని వీరయ్య కుటుంబసభ్యులు ఏసీపీకి వినతిపత్రం అందజేశారు. రౌడీషీట్ తెరిచేందుకు స్టేషన్కు పిలిపిస్తే కేసుల నుంచి తప్పించు కునేందుకు ఆత్మహత్య డ్రామా ఆడు తున్నాడని పోలీసులు తెలిపారు.