Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు ఉత్తమ్ ప్రశ్న
- సడక్ బంద్కు సంపూర్ణ మద్దతు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇప్పటి వరకు 24మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయినా అహంకారం తగ్గలేదా? అని సీఎం కేసీఆర్ను టీపీసీసీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. ముఖ్య మంత్రి కార్మికుల పట్ల అమానవీయంగా ప్రవర్తి స్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రచేయ లేదనీ, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రధాన ప్రతిపక్షంగా తాము ఎలాంటి ఆలోచనా చేయలేదన్నారు. ఆదివారం గాంధీభవన్లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎంపి ఎనుముల రేవంత్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు, షబ్బీర్ అలీలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆర్టీసీ తాత్కాలిక ఎండీగా సునీల్శర్మ ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నట్టు హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో హైకోర్టులో అన్ని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు సరైనవి కాదనీ, వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తన జాగీర్ అన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈనెల 19న ఆర్టీసీ కార్మికులు చేపట్టనున్న సడక్బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంద న్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రపంచానికే రోల్ మోడల్గా ప్రజారవాణా వ్యవస్థగా నంబర్ వన్గా నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 57వేల మంది ఉద్యోగుల నుంచి క్రమంగా తగ్గి 49వేలకు పడిపోయారనీ, కేసీఆర్ సీఎం అయిన తర్వాత 8వేల మంది తగ్గించి, ఆర్టీసీ కార్మికులపై తీవ్రమైన పని భారం మోసారని చెప్పారు.