Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాన్వాయ్ని ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అడ్డు కున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల ను లబ్దిదారులకు పంపిణీ చేయడానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి నివాసానికి వెళ్తున్న క్రమంలో బస్స్టాండ్ సమీపంలో మంత్రి కాన్వారుని పెద్దపల్లి కార్మికులు అడ్డుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. 44 రోజులుగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించక పోవడం బాధాకర మన్నారు. కార్మిక బిడ్డగా మీరు వారిధిగా నిలిచి ఆర్టీసీ ప్రయివేటుపరం కాకుండా కాపాడాలని మంత్రిని కోరారు. పెద్దపల్లి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ గొంటి కోటేశ్వర్,కో-కన్వీనర్ వైఎస్రెడ్డి ఉన్నారు.