Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వ మద్యం విధానంపై తెలంగాణ తెలుగుదేశం సమరభేరి మోగించాలని నిర్ణయించింది. ఈమేరకు గురు వారం హైదరాబాద్లోని ఎన్టీఆర ్భవన్లో టిటిడిపి కార్యనిర్వాహాక అధ్యక్షులు ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కెసిఆర్ పాలనావైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి, తెలుగు మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, మాజీ మంత్రి పి.రాములు, నల్గొండ జిల్లా అధ్యక్షులు బిల్యానాయక్ పాల్గొన్నారు.