Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పిజిఈసెట్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానుంది. ఈనెల 31వ తేదీ వరకు ఆప్షన్ల నమోదు ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు పిజిఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్బాబు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పిజిఈసెట్లో ధ్రువపత్రాల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20,500 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పిజిఈసెట్ రాతపరీక్షలో 38 వేల మంది విద్యార్థులు అర్హత సాధించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పిజిఈసెట్ కింద 22,300 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 12 ప్రభుత్వ కాలేజీల్లో 1,355 సీట్లు, 293 ప్రైవేట్ కాలేజీల్లో 20,945 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.