Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చొద్దని వక్తలు ప్రభుత్వానికి సూచించారు. ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నది ప్రజానీకంతో తాగించేందుకు కాదన్నారు. ఓయు టిఎస్ జెఏసి ఆధ్వర్యంలో 'త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను తాగుబోతుల దుకాణంగా మార్చొదు'్ద అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. టిఎస్ జెఏసి ఛైర్మన్ రంగు బాలలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చీప్ లిక్కర్ కోసమే కాకుండా, సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.