Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కార్టూన్ కేసులో ఔట్లుక్ పత్రికకు కొద్దిరోజుల ఊరట లభించింది. వచ్చే నెల 9వ తేదీ వరకు కేసుకు సంబంధించి అన్ని చర్యల పైన గురువారం హైకోర్టు స్టే విధించింది. ఔట్ లుక్ సిబ్బందిని టెర్రరిస్టుల కంటే హీనంగా విచారించారని ఆ సంస్థ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. వాదనల అనంతరం న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఔట్లుక్ ఎడిషన్లో తనను కించపరుస్తూ కథనాన్ని ప్రచురించడంపై స్మితా సబర్వాల్ కేసు వేసిన విషయం తెలిసిందే.