Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబరు 8 వరకు అవకాశం
- టిడబ్ల్యూజెఎఫ్ విజ్ఞప్తికి కమిషనర్ అంగీకారం
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
తెలంగాణ జర్నలిస్టుల హెల్త్కార్డుల పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ సెప్టెంబరు 8 వరకు పెంచింది. ఈమేరకు శనివారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (టిడబ్ల్యూజెఎఫ్) విజ్ఞప్తి మేరకు కమిషనర్ బి.పి ఆచార్య గడువును పెంచడానికి అంగీకరించారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఆప్షనల్ సెలవులు రావడం, దరఖాస్తుల ఫార్మాట్ కొంచెం కఠినంగా ఉండటం, అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మరో వారం రోజులు సమయం అవసరమని ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం చేసిన విజ్ఞప్తిని సమాచార శాఖ కమిషనర్ బిపి ఆచార్య అంగీకరించారు. దరఖాస్తులను సెప్టెంబరు 8 సాయంత్రం వరకు హైదరాబాద్లోని సమాచార భవన్, జిల్లాల్లో సమాచార శాఖ డిప్యూటి డైరెక్టర్ కార్యాలయాలతోపాటు టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లో జర్నలిస్టులు దరఖాస్తులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ఒక ప్రకటన విడుదల చేశారు.