Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజాపద్దుల సంఘం (పిఏసి) ఛైర్మన్ పటోళ్ల కిష్టారెడ్డి మరణంతో ఆ పదవి ఖాళీ అయింది. ఈ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పో టీ నెలకొంది. మాజీ మంత్రి జె గీతా రెడ్డి, డికె అరుణ పేర్లు వినిపి స్తున్నా యి. ఈ పదవికి తీవ్రమె ౖన పోటీ ఉండడంతో రెండున్నర సంవత్సరాలకు ఒకరు చొప్పున పార్టీ ఇద్దరికి అవకాశం ఇచ్చింది. మొదటి రెండున్నర సంవత్సరాలు కిష్టారెడ్డి, మిగిలిన రెండున్నర ఏళ్ళు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించాలని పార్టీ నిర్ణ యించినట్ల్లు ప్రచారం జరిగింది. దీని ప్రకారం కిష్టారెడ్డి మరణం తో రాంరెడ్డి వెంకటరెడ్డికేే అవకాశం ఉండొచ్చని సిఎల్పీ వర్గాలు అంటు న్నాయి.
డిఎస్తో జర జాగ్రత్త : విహెచ్, మహేష్కుమార్గౌడ్
కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి పార్టీ అధికారం కోల్పోగానే మళ్లీ పదవి అనుభవించాలనే దురుద్దేశంతో డి శ్రీనివాస్ టిఆర్ఎ స్లో చేరారని, ఆయనతో జర జాగ్రత్త అంటూ సిఎంను టిపిసిసి హెచ్చరిం చింది. దేశంలోనే ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్న వ్యక్తి డిఎస్కు పేరుందని పేర్కొంది. శనివారం గాంధీభవన్లో ఎంపి వి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి మహేష్కుమార్గౌడ్ విలేకరులతో మాట్లాడారు. టికెట్టు అమ్ము కున్న వ్యక్తి బయటకెళ్లి పార్టీ విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ నాకేమిచ్చిందన్న డిఎస్ వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచారన్నారు. రెండు సార్లు పిసిసి అధ్యక్షపదవి కట్టబెట్టిందన్నారు. పార్టీ నాకేమిచ్చిందన్న డిఎస్ వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచారన్నారు. రెండుసార్లు పిసిసి అధ్యక్షపదవి కట్టబెట్టిందన్నారు. నోరు విప్పితే కాంగ్రెస్ నేతల బండారం బయటపడుతుందన్న డిఎస్...ఏం బండారమో బయట పెడతారో పెట్టాలని డిమాండ్ చేశారు.