Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17న తెలంగాణ విమోచన దినోత్సవం
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం
ప్రాజెక్టుల పూర్తి, నిధుల కేటాయింపుపై సెప్టెంబర్ మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని సిపిఐ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఖమ్మంలో సిపిఐ, నల్లగొండలో సిపిఎం పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ను బరిలో దించాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఆయన అంగీకరించకపోతే మల్లేపల్లి లక్ష్మయ్య, ఫ్రొఫెసర్ గాలి వినోద్కుమార్ లాంటి వారి పేర్లను పరిశీలిస్తామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్కు సామాన్యుల సమస్యలు వినే తీరిక, పరిష్కరించే ఓపిక కొరవడ్డాయని విమర్శించారు. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోగా, ఆందోళన చేస్తే అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. దొరతనంతో ప్రజల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్కు సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణా విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, సిద్ది వెంకటేశ్వర్లు, కార్యదర్శివర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు పాల్గొన్నారు.