Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు మంత్రులున్నా ఫలించని బుజ్జగింపులు
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నేతలే రెబెల్స్
- మంత్రి గంగుల అనుచరుడి ఫోన్కాల్ వైరల్
- సిరిసిల్లలో వెలుగులోకి బెదిరింపుల పర్వం
నవతెలంగాణ-కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు టీఆర్ఎస్ టిపోరును తెచ్చిపెట్టాయి. నలుగురు మంత్రు లున్నా రెబెల్స్ బెడదను తప్పించలేకపోయారు. ముఖ్యం గా ఇద్దరు మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ సొంత నియోజకర్గ కేంద్రాలైన కరీంనగర్ కార్పొరేషన్, హుజూరాబాద్ మున్సిపాలిటీలతో పాటు మిగతాచోట్లా స్వతంత్రులుగా బరిలో ఉండడం ఇన్చార్జీలకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్, సిరిసిల్లలో విత్డ్రా చేసుకోవాలని నేతల బుజ్జగింపు, బెదిరింపులకు సంబంధించిన ఆడియో, వీడియోలు వైరల్ కావడం కలకలం రేపుతున్నది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు 14 మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డులు కలిపి 461 ఉన్నాయి. సుమారు 5వేల వరకు నామినేషన్లు వచ్చాయి. టీఆర్ఎస్ నుంచే అత్యధికంగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. రామగుండం, మిగతా 14 మున్సిపాలిటీల్లో నామినేషన్ల విత్డ్రాల చివరిరోజు బీఫామ్లు అందజేయగా పెద్దసంఖ్యలో రెబెల్స్ బయటకొచ్చారు. అంతకంటే ముందే నాలుగురోజులుగా ఆశావహులను అనేక రకాలుగా బుజ్జగించారు. పార్టీలో పదవులు, కార్పొరేషన్ పదవులు ఇస్తామనీ, లేకుంటే డబ్బులు, ఇతర కాంట్రాక్టు పనుల వంటి ప్రలోభాలకు గురిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. మరీ మొండికేసిన వారిని బెదిరింపులకు పాల్పడ్డట్టుగా బయటపడుతోంది. అయినప్పటికీ నామినేషన్ విత్డ్రా తర్వాత మంత్రుల ఇలాకాల్లో పెద్దసంఖ్యలో రెబెల్స్ పోటీలో ఉన్నారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంటల్లో 30 చొప్పున వార్డులుండగా 15 వార్డుల్లో రెబెల్స్ పోటీకి దిగారు. ఒక్కో వార్డులో ఇద్దరు, ముగ్గురు బరిలో నిలిచారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ సర్దిచెప్పినా 50 డివిజన్లలో మూడుచోట్ల కీలక నాయకులే రెబెల్గా పోటీ చేస్తుండటం వారికి తొలనొప్పిగా మారింది. అందులోనూ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరులు, దగ్గరి బంధువులే పోటీ చేయడంతో మింగుడు పడటంలేదు. మంథనిలో జెడ్పీ చైర్మెన్ అనుచరుడే 5వ వార్డులో రెబల్గా పోటీ చేస్తున్నాడు.
జగిత్యాలలో కనిపించని మాజీ ఎంపీ కవిత
గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై జగిత్యాలలో తొ లిసారి టీఆర్ఎస్ను గెలిపించిన మాజీ ఎంపీ కవిత ప్ర స్తుతం మున్సిపల్ ఎన్నికల్లో పత్తా లేరు. ఈ జిల్లాలోని జ గిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బలంగా ఉ ంది. స్థానిక ఎమ్మెల్యే సంజరుకుమార్ ఆశావహులను బుజ్జగించడంలో వైఫల్యం చెందడంతో ఎక్కువ సంఖ్యలో రెబెల్స్ పోటీలో ఉన్నారు.