Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టుకు హాజరైన సబిత, ధర్మాన, ఇతర రిటైర్డు ఐఏఎస్లు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుక్రవారం చుక్కెదురైంది. సీబీఐ కేసులతో పాటే ఈడీ కేసులను కలిపి విచారించాలన్న జగన్ తరపు న్యాయవాది కోర్టుకు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. అలాగే సీబీఐఐ వేసిన ఛార్జిషీట్లపై విచారణను పూర్తి చేశాకే ఈడీ కేసులపై విచారణను జరపాలనే జగన్ తరపు మరో విజ్ఞప్తిని కూడా కోర్టు నో చెప్పింది. అనంతరం ఈ కేసు విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో అనుబంధ ఛార్జిషీట్లో నిందితులుగా పేర్కొనబడ్డ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు, రిటైర్డు ఐఏఎస్ అధికారి లక్ష్మీ, శామ్యూల్, రాజ్గోపాల్ తదితరులు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసును కూడా కోర్టు ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.