Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలని తీర్మానాలు చేయాలి:
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
విద్య, వైదాన్ని నిర్లక్ష్యం చేయొద్దని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా సమావేశాల్లో తీర్మానాలు చేస్తే మరింత మంచిదన్నారు. జనగామ జిల్లా పరిషత్ సమావేశం చైర్మెన్ పాగాల సంపత్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం పెట్టే ఖర్చు తక్కువగా ఉందన్నారు. రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.1.04లక్షలు పెడుతుండగా కేజీబీవీ, హైస్కూళ్లలో ఇంకా తక్కువగా ఉందన్నారు. ప్రతి మండలంలో పది నుంచి పదిహేను పాఠశాలల్ని ఎంచుకుని విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. జనగామలో 400 ప్రైమరీ స్కూల్స్ ఉండగా 100మంది వరకు పిల్లలు ఉన్నవి 300 పాఠశాలలు ఉంటాయన్నారు. మిగతా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే బాధ్యత ప్రజాప్రతినిధులు తీసు కోవాలని కోరారు. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతి నిధులగా మనపైనే ఉందన్నారు. బడిపై నమ్మకం కలిగితే విద్యార్థులను పంపడానికి తల్లిదండ్రులు వెనుకాడరన్నారు. ప్రైమరీ స్కూల్స్లో సమస్యలు ఉన్నాయన్నారు. విద్యతో పాటు వైద్యం అత్యంత కీలకమైంద న్నారు. అభివృద్ధి చెందిన అమెరికాలాంటి దేశాల్లో పై రెండు రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. జనగామ జిల్లాలో వందకు 32 మంది ప్రయివేటు పాఠశాలకు వెళ్లితే 68 మంది ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారన్నారు. వరంగల్లో వందకు 35మంది ప్రయివేటు పాఠశా లలకు వెళ్లితే 65మంది ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారని వివరించారు. సమావేశంలో సీఈఓ రమాదేవి, జేసీ ఓజే మధు పాల్గొన్నారు.