Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త రైల్వే లైన్లను కేంద్రం అంగీకరించాలి
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
నవతెలంగాణ - హుజూరాబాద్/ జమ్మికుంట
ప్రధాని నరేంద్ర మోడీ ఐదేండ్లలో దిక్సూచి లేకుండా పాలించి దేశ ఆర్థిక మాంద్యానికి కారణమయ్యారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో శుక్రవారం విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ పాలనతో దేశ ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అనేక రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్తో భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనని అన్ని రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయన్నారు.