Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు.. : సమీక్షలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామాలు పచ్చదనంతో, పరిశుభత్రతో వెల్లివిరియాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం మరింత పకడ్బందీగా జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ఎలా అమలవు తున్నదీ, అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ పరిధిలో విధులు ఎలా నిర్వహిస్తున్నారనే విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వీలుగా త్వరలో తానే గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు నిర్వహిస్తానని ఆయన చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఫోటోలకు ఫోజులిచ్చే కార్యక్రమం కాకుం డా, చిత్తశుద్ధితో పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచేందుకు పనులు చేయించాలని కోరారు. పల్లె ప్రగతి స్పూర్తితో త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించనున్నట్టు సీఎం వెల్లడించారు. పల్లె ప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, అల్లోల ఇంద్ర కరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ తివారీతోపాటు పలువురు అధికారులు ఈ సమావే శంలో పాల్గొన్నారు. 'పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తామే గ్రామాన్ని ఊడ్చినట్టు పేపర్లో ప్రచారం కోసం ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఇది సరైంది కాదు. వారంతా ఉన్నది చీపురు పట్టి ఊడ్వడానికి కాదు. గ్రామాల్లో ఎవరి పని వారితో చేయించ డానికి. గ్రామ పంచాయతీల్లో అవసరమైన సిబ్బందిని నియమించాం, వేతనాలు పెంచాం, ట్రాక్టర్లున్నాయి. వాటిని ఉపయోగించి, పని చేయించాలి. అంతే తప్ప మొక్కుబడి వ్యవహారం కావద్దు. గ్రామాల్లో పచ్చ దనం, పరిశుభ్రత పనులు ఎలా జరుగుతున్నాయి? పల్లె ప్రగతి పురోగతి ఎలా ఉంది..? ఎవరెవరు తమ బాధ్యతల ను సరిగ్గా నిర్వహిస్తున్నారు? అనే విషయాలు పరిశీలించ డానికి నేనే స్వయంగా త్వరలో గ్రామాల్లో ఆకస్మిక పర్యట నలు చేస్తాను...ఈ స్ఫూర్తితో త్వరలో పట్టణ ప్రగతి కార్యక్ర మాన్ని ప్రారంభిస్తాం...' అని ముఖ్యమంత్రి తెలిపారు.
నగరాలు, పట్టణాల పరిరక్షణ చర్యలు...
హైదరాబాద్ నగరంతోపాటు, ఇతర నగరాలు, పట్టణాలు కాలుష్య కూపాలుగా మారకుండా పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. నగరాల లోపల, బయట ఉన్న అటవీ భూముల్లో విరివిగా చెట్లు పెంచి, దట్టమైన అడవులు ఉండేలా చూడాలని కోరారు.