Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మజ్లిస్ మెప్పుకోసం టీఆర్ఎస్ నాటకాలు: కేంద్ర మంత్రి
నవతెంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దక్షిణాదిని విస్మరించలేదనీ, అవగాహన లోపంతోనే కేంద్రంపై కేటీఆర్, శ్రీనివాస్ యాదవ్ తది తర మంత్రులు ఇష్టా రీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ టీఆర్ఎస్పై విమర్శలు గుప్పిం చారు. మంగళవారం చర్లపల్లి రైల్వేస్టేషన్ శాటిలైట్ టర్మినల్తో పాటు దక్షిణమధ్య రైల్వే పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రిమోట్ లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాం లోనే సౌత్ సెంట్రల్ రైల్వేను నిర్లక్ష్యం చేశారనీ, ప్రధాని మోడీకి దేశమంతా ఒక్కటే నని స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో రూ.258 కేటాయించగా, ఎన్డీయే హయాం లో 2020-21 బడ్జెట్లో 2,602 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. 2008లో ప్రారంభిం చిన పెండింగ్ పనులన్ని పూర్తి చేశామన్నారు. ఎంఎంటీఎస్ కోసం రూ. 500 కోట్లు కేంద్రం ఇచ్చిందనీ, రాష్ట్రం వాటా ఇంకా మొత్తం చెల్లించకపోవడంతో పనులు నత్తనడకన సాగుతు న్నాయని తెలిపారు. నిజామాబాద్ లో కేసీఆర్ కూతురును ఓడించడం ద్వారా ప్రజలు టీఆర్ఎస్కు గట్టి సంకేతం పంపారని వ్యాఖ్యానించారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కేసీఆర్ ప్రకటించడం బాధాకర మనీ, భారత రాజ్యాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం అగౌరవ పరుస్తున్నదని విమర్శించారు. ఒవైసీ మెప్పుకోసం కేసీఆర్ మత రాజకీయాలు చేస్తున్నారనీ, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామనడాన్ని ఆయన తప్పు పట్టారు. పక్క దేశాల్లో మతహింసకు గురవుతున్న వారికి ఆశ్రయమిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందు తున్న హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు అనుసంధానంగా ఉన్న నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతి రోజూ వేల మంది ప్రయాణిస్తారనీ, చర్లపల్లి రైల్వేస్టేషన్ శాటిలైట్ టర్మినల్ ఏర్పాటుతో రద్దీ భారం తగ్గుతుందని అన్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంచడం తో పాటు యాద్రాది వరకు వరకు పొడిగించా లని రైల్వే మంత్రిని కోరారు. రాష్ట్ర పశు సంవ ర్ధకశాఖ మంత్రి శ్రీనివాస్యాదవ్ మాట్లాడు తూ సౌత్ సెంట్రల్ రైల్వే అభివృద్ధి విషయం లో కేంద్రం నిర్లక్ష్యం చూపుతున్నదని విమర్శిం చారు. ఎంఎంటీఎస్ ఫేస్-2ను ఘట్కేసర్ వరకు పొడిగించడంతో పాటు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దక్షిణమధ్య రైల్వే జీఎం.గజానన్ మాల్య తదితరులు పాల్గొన్నారు.