Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తొలి పీఆర్సీ గడుపు 2020 డిసెంబర్ 31 వరకు పొడగిస్తున్నట్టు జీవో ఆర్టీ నెంబర్ 447ను రాష్ట్ర జారీ చేయడం సరిగాదనీ, 2018 జూలై నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, ఎం.సాయిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్థికమాంద్యంతో నిత్యావసరాల ధరలు నియంత్రించలేని స్థితిలో అత్యల్ప జీతాలతో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగుసేవ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పాల్పడుతున్నారని తెలిపారు. రెండున్నరేండ్లు జాప్యం చేయడం వల్ల వేతనాలు, సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. వెంటనే పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.